వారిద్దరూ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కానీ ప్రస్తుతం వారిద్దరూ బద్ద శత్రువులు లా మారి ధియేటర్ల హైజాకింగ్ లో ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. ఈ విచిత్రమైన పోటీని ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ ఆసక్తికరంగా చూస్తోంది. వారే ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రముఖ హీరో నితిన్, దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ ‘తొలి ప్రేమ’ సినిమా నుంచి పవన్ వీరాభిమానిగా మారిపోయానని చెపుతోంటే ఏకంగా పవన్ పాటలను తన సినిమా టైటిల్స్ గా మార్చుకుని తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు హీరో నితిన్.
తాను నిర్మించిన ‘ఎవడు’ సినిమా గురించి దిల్ రాజ్, తాను అభిమానంతో ముచ్చటపడి తన తండ్రిచే కొనిపించి ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల చేయడానికి ధియేటర్ల సంఖ్యలో ఒకరు పై ఒకరు పోటీ పడుతూ చివరకు నైజాం ప్రాంతంలోని పాత ధియేటర్లను కూడా వదలడం లేదట. ఇప్పటి వరకూ ఒక సినిమాకు సంబందించి తమ సినిమా మొట్టమొదటి రోజు ఇన్ని కోట్లు వసూలు చేసింది అని గొప్పలు చెప్పుకునే వారిని చూసాము.
కానీ నేడు దీనికి భిన్నంగా మా సినిమా ఇన్ని వందల దియేటర్ల లో రిలీజ్ అయింది అనే గొప్పలు చెప్పుకునే ఒక విచిత్రమైన పోటీని దిల్ రాజ్ , హీరో నితిన్ కుటుంబ సభ్యుల మధ్య చూడబోతున్నాం. ఒక వైపు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మెగా హీరోల మధ్య పోటీ, మరొక వైపు ఇద్దరు పవర్ స్టార్ వీరాభిమానుల మధ్య పోటీ. ఈ రసవత్తర పోరులో తెలుగు సినిమా ప్రేక్షకుడు ఎవరికి విజయాన్ని ఇస్తాడో రానున్న కొద్ది రోజులలో తెలిసిపోతుంది....